MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, January 22, 2017

డిజిటల్‌ విద్య.. అదరహో! బాగా ఆసక్తి చూపుతున్న విద్యార్థులు రెగ్యులారిటీ పెరిగిందన్న ఉపాధ్యాయులు కర్ణాటక మెచ్చిన విధానం బోధన తీరుపై ‘ఈనాడు’ పరిశీలన ఈనాడు-అమరావతి

పాఠ్య పుస్తకాన్ని అర చేతిలో పట్టుకుని బోధించటం ఇదీ ప్రస్తుత విద్యావిధానం.అసలు పుస్తకం చేత పట్టుకోకుండా కేవలం రిమోట్‌ కంట్రోల్‌తో బోధించటం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది.అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే నమ్మండి.
ACT
Image result for READ MORE GIF IMAGES
కొత్త జాతీయ విద్యా విధానం ఆవిష్కృతం కాబోతున్న వేళ దేశీయ విద్యా రంగం ముఖచిత్రమే మారబోతోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి కాలం చెల్లిన, మూసధోరణితో కూడిన బోధన పద్ధతులకు స్వస్తి పలికి పాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న వర్చువల్‌, విజ్వులైజ్డు విద్యా బోధనకు చిరునామాగా ఉండాలని భావిస్తోంది. సాంకేతిక పథంలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం తొలుత కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టింది. ప్రతి దస్త్రం ఆన్‌లైన్‌లో పరిష్కారమయ్యేలా డిజిటల్‌ బిల్లుల విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన డిజిటల్‌ విధానంలో సాగాలని కోరుకుంటోంది. జిల్లాలో ఈ విద్య అమలవుతున్న కొన్ని పాఠశాలలకు ప్రత్యక్షంగా ‘ఈనాడు’ పరిశీలించింది. జిల్లాలోనే తొలిసారిగా రావెల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇది ప్రారంభమైంది. ఆతర్వాత పొన్నేకల్లు, ముట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులు మొదలుకుని ఉపాధ్యాయుల దాకా ఏ ఒక్కర్ని కదిలించినా ఇది అత్యుత్తమమైన విద్యా బోధనన్నదే వ్యక్తమయ్యింది..
డిజిటల్‌ విద్య అనేది యానిమేషన్‌, లైవ్‌ చిత్రాలతో మిళితమై ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని వల్ల వారిలో సృజనాత్మక శక్తి పెరగటంతో పాటు ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. తరగతులు ప్రారంభమై 50 రోజులు పైబడుతోంది. ఈ విద్యకు ఒక కంప్యూటర్‌, ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌, భారీ తెర తదితర సామగ్రితో పాటు విద్యుత్తు సౌకర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే డిజిటల్‌ క్లాసులు అందుబాటులోకి వచ్చినట్లే. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేవలం 40 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలవుతోంది. ప్రభుత్వం కంప్యూటర్‌, తెరలు, పాఠ్యాంశాలకు సంబంధించిన కంటెంట్‌ సీడీలను మాత్రమే సరఫరా చేస్తోంది. మిగిలినవి పాఠశాలల ఉపాధ్యాయులు దాతల సహకారంతో వాటిని అధిగమిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ బోధనకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయటానికి పాఠశాల విద్యాశాఖ ద్వారా రూ.1.45 లక్షలు అందించాలని భావిస్తోంది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం కోరింది. గుంటూరు జిల్లాలో రావెల పాఠశాలలో పూర్తిగా దాతల సహకారంతోనే డిజిటల్‌ తరగతులు ప్రారంభించి జిల్లాకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల కర్ణాటకకు చెందిన పాఠశాల విద్యాశాఖ బృందం గుంటూరు జిల్లా రావెల జడ్పీ ఉన్నత పాఠశాలకువచ్చి ఈ తరగతులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించింది. తమ రాష్ట్రంలో వీటి అమలుకు ఇక్కడ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆ రాష్ట్ర విద్యాశాఖ బృందం వ్యాఖ్యానించింది.
బోధనకే పరిమితం! ఇప్పటి వరకు ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలో ఏది ఉంటే అది పిల్లలకు మూసపద్ధతిలో బోధించి మీ చావు మీరు చావండని చేతులు దులుపుకొనేవారు. ఈ క్రమంలో అసలు నదులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు.. పట్టణీకరణ, పోడు వ్యవసాయం వాటి విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా కనీస పరిజ్ఞానం ఉండేది కాదు. దీనికి కారణం అసలు పరిశ్రమల వూహా చిత్రం ఎలా ఉంటుంది? అందులో ఏయే సెక్టార్లు ఉంటాయి.. ఏదైన ఒక వస్తువు ఉత్పత్తి ఎలా జరుగుతుందో నేరుగా పరిశ్రమలకు తీసుకెళ్లి చూపించకపోయినా.. కనీసం ఇలా ఉత్పత్తి జరుగుతుందని యానిమేషన్‌, విజ్వులైజ్డు పద్ధతుల ద్వారా తెలియజేసే ఏర్పాట్లు ఇప్పటి దాకా మన పాఠశాలల్లో లేవంటే అతిశయోక్తి కాదు. టీచర్‌ పాఠ్యపుస్తకంలో ఉన్న చిత్రాన్ని బ్లాక్‌ బోర్డుపై గీసి చెప్పటం మినహా మరో మార్గం లేదు. ఈ క్రమంలో ఆ బోధన వారిచెవికెక్కక పిల్లలు బుర్రబద్ధలు కొట్టుకుంటున్నారు. దీనికి స్వస్తి పలకాలని తరగతి గదిలోనే ప్రతి అంశంపై విద్యార్థికి కనీసం కొంత విషయ పరిజ్ఞానంతో పాటు అందుకు సంబంధించిన పరికరాలపై పరిచయం ఉండాలని చెప్పి డిజిటల్‌ విద్యలో భాగంగా ప్రతి పాఠ్యాంశాన్ని సోదాహరణంగా కంప్యూటర్‌ ద్వారా బోధించటానికి చర్యలు చేపట్టింది. అందులో భాగమే ఈ డిజిటల్‌ తరగతులు.

No comments: